Breaking News

RTC strike: ప్రగతి భవన్ ముట్టడి.. రేవంత్ సహా పలువురి హౌస్ అరెస్ట్, భారీగా ట్రాఫిక్ జామ్


17 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించింది. కాంగ్రెస్ పిలుపు మేరకు ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. గాంధీ భవన్ నుంచి ర్యాలీగా చేరుకొని ప్రగతి భవన్‌ను ముట్టడించడం కోసం నేతలు యత్నించారు. ప్రగతి భవన్‌ను ముట్టడిస్తారనే సమాచారం ఉండటంతో.. సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందే హౌస్ అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించే అవకాశం ఉన్న కాంగ్రెస్ నాయకులను ఉదయం ఐదు గంటల నుంచే పోలీసులు అరెస్ట్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ తీరు పట్ల వారు మండిపడ్డారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంత పాలన సాగిస్తున్నారని వారు ఆరోపించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లాల్లోనూ కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. ముట్టడిని భగ్నం చేయడం కోసం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బేగంపేట, సికింద్రాబాద్ మధ్య ప్రయాణిస్తోన్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.


By October 21, 2019 at 09:48AM


Read More https://telugu.samayam.com/telangana/news/congress-calls-for-pragathi-bhavan-siege-revanth-reddy-and-other-leaders-house-arrested/articleshow/71681486.cms

No comments