Breaking News

Pragathi Bhavan Siege: పోలీసులకు చిక్కని రేవంత్ రెడ్డి.. ఎంపీ జాడ కోసం వెతుకులాట


నేపథ్యంలో.. పోలీసులు మల్కాజ్‌గిరి ఎంపీ కోసం వెతుకుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ముందస్తుగా చాలా మంది నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారని ఆయన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో వీడియోను పోస్టు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఇంట్లో లేరని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ప్రగతి భవన్‌ సమీపంలో ఉన్న హోటళ్లలో రేవంత్ కోసం తనిఖీలు చేస్తున్నారు. రేవంత్‌ అనుచరుల ఇళ్లనూ పోలీసులు చెక్‌ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ రేవంత్ జాడ తెలియలేదు. ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం పోలీసులు తిప్పలు పడుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. వీరిని వాహనాల్లో ఉంచి హైదరాబాద్ చుట్టూ తిప్పుతున్నారు. సాయంత్రం వరకు వీరిని ఇలాగే నగరం చుట్టూ తిప్పుతారని తెలుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తుండటంతో.. ప్రగతి భవన్‌తోపాటు చుట్టూ 4 కి.మీ. మేర ఉన్న సర్కిళ్లలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఏడాది క్రితం.. బెడ్రూం తలుపులు పగలగొట్టి మరీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ కోస్గిలో బహిరంగ సభలో నిర్వహించడానికి ముందు పోలీసులు రేవంత్ ఇంటిపై దాడి చేశారు. దీనికి నిరసనగా రేవంత్ అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై ధర్నా చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని, కేసీఆర్‌ను అడ్డుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో ఊహించని రీతిలో అక్టోబర్ 3, 2018న అర్ధరాత్రి దాటిన తర్వాత ఏకంగా బెడ్‌రూం తలుపులు పగలగొట్టిన పోలీసులు.. రేవంత్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన అప్పట్లో వివాదాస్పదమైంది.


By October 21, 2019 at 11:28AM


Read More https://telugu.samayam.com/telangana/news/telangana-police-searching-for-malkajgiri-mp-revanth-reddy/articleshow/71682827.cms

No comments