Breaking News

గుంతలతో నా జీవితాన్ని రిస్క్‌లో పడేశారు.. జీహెచ్ఎంసీపై యువకుడి ఫిర్యాదు


ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలతో వాహనదారులకు నరకం చూస్తున్నారు. ఇక వర్షం పడిన సమయంలోనైతే.. రోడ్డ మీద నీరు నిలిచిపోవడంతో.. ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ మ్యాన్‌హోల్ ఉందో కూడా తెలియని దుస్థితి. రోడ్డు మీద గుంతల కారణంగా బైక్ మీద వెళ్లే చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. పాతబస్తీలోని డబీర్‌పురాకు చెందిన సయ్యద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రీ అనే యువకుడు కూడా ఆదివారం సాయంత్రం బైక్ మీద వెళ్తూ.. గుంతలో పడి కాలు విరగొట్టుకున్నాడు. జాఫ్రి అక్టోబర్‌ 6న రాత్రి 7.30 గంటలకు బైక్‌ మీద నూర్‌ఖాన్‌ బజార్‌ నుంచి బాల్‌షెట్టి ఖేట్‌కు బయల్దేరాడు. రోడ్డ మీద ఉన్న గుంతలో బైక్ దిగబడటంతో.. అతడు బైక్ మీది నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి కుడి కాలు ఫ్రాక్చర్‌ అయ్యింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు ప్రమాదం జరిగిందని ఆరోపించిన జాఫ్రీ.. నగరపాలక సంస్థపై డబీర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కాలు విరగడానికి జోనల్ కమిషనర్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. డబీర్‌పురా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన కాసేపట్లోనే జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఆ గుంతను పూడ్చేశారు. అదేదో ముందే చేస్తే.. అతడి కాలు విరగకుండా ఉండేది కాదు కదా. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉండటంతో.. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


By October 11, 2019 at 08:08AM


Read More https://telugu.samayam.com/telangana/news/hyderabad-potholes-problem-man-files-case-on-ghmc-officials-for-putting-his-life-at-risk/articleshow/71532815.cms

No comments