అనుమానపు చిచ్చు.. భార్యను గొడ్డలిలో నరికి చంపిన కానిస్టేబుల్
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే భార్య పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమెను విచక్షణా రహితంగా నరికి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. Also Read: వివరాల్లోకి వెళితే.. కర్నూలుకు చెందిన అబ్దుల్ రషీద్కు 2013లో నౌషిద్ బేగం(23) అనే యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. హైదరాబాద్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రషీద్ ఏడాదిగా అంబర్పేటలోని ఆజాద్నగర్లో నివాసముంటున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న రషీద్ ఆమెతో తరుచూ గొడవ పడేవాడు. శుక్రవారం మధ్యాహ్నం కూడా ఇదే విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇంటి యజమాని సలీం దంపతులకు నచ్చజెప్పాడు. Also Read: మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి పెద్ద కేకలు రావడంతో యజమాని వారి పోర్షన్కు వెళ్లి చూడగా నౌషిద్ రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు అక్కడికి చేరుకుని నౌషిద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. తలపై గొడ్డలితో బలంగా నరకడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. భార్యను దారుణంగా చంపి పరారైన రషీద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:
By October 13, 2019 at 08:28AM
No comments