హాస్టల్లో దూరి అత్యాచారయత్నం.. దుండగుడిని కుమ్మేసిన యువతి
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించిన దుండగుడు ఓ ఎంబీబీఎస్ విద్యార్థిపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాత్రూమ్కి వెళ్లి వస్తున్న యువతిని వెనుక నుంచి పట్టుకుని దుస్తులు చింపేశాడు. ఆమెపై గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. యువతి కేకలు వేయడంతో స్క్రూడ్రైవర్తో పొడిచేస్తానని బెదిరించాడు. Also Read: అయితే ఆ సమయంతో ధైర్యం తెచ్చుకున్న యువతి అతడి చేతిలోని స్క్రూడ్రైవర్ లాక్కుని పిడిగుద్దులు కురిపించింది. బాధితురాలి అనూహ్య ప్రతిఘటనను ఊహించని దొంగ ఆమెను తోసేసి సెల్ఫోన్, రూ.15వేల నగదు తీసుకుని అక్కడికి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఎదుట ఆందోళన చేపట్టారు. హాస్టల్లో అమ్మాయిలకు భద్రత లేకుండా పోయిందంటూ వేలాది మంది నిరసన చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చి ఆందోళణ విరమింపజేశారు. తొలుత కేవలం దొంగతనం కేసు మాత్రమే నమోదు చేయడంతో విద్యార్థులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లైంగిక వేధింపుల కింద కూడా కేసు నమోదు చేశారు. Also Read: బీఎంసీ కాలేజ్ హాస్టల్లో దొంగతనాలు, దాడులు ఇదే తొలిసారి కాదని కొద్దిరోజుల క్రితమే ఓ అమ్మాయి గదిలో దొంగతనం జరిగిందిన విద్యార్థినులు చెబుతున్నారు. ఈ హాస్టల్లో ఇప్పటివరకు 10 దొంగతనాలు జరిగినట్లు తెలుస్తోంది. Also Read:
By October 07, 2019 at 09:48AM
No comments