Breaking News

మోదీని హత్య చేయబోతున్నారంటూ పోలీసులకు ఫోన్.. ఆకతాయి అరెస్ట్


ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్యకు చేయబోతున్నారంటూ ఓ ఆకతాయి చేసిన ఫోన్ తమిళనాడు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. సోమవారం చెన్నైలో మోదీ పర్యటన నేపథ్యంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఆదివారం ఓ ఫోన్‌కాల్ వచ్చింది. గతంలో రాజీవ్‌గాంధీని హత్య చేసిన విధంగానే మోదీని చంపేందుకు కొందరు ప్లాన్ వేశారని, ఓ చోట ఇద్దరు వ్యక్తులు ఈ విషయం గురించి మాట్లాడుకుంటుండగా తాను విన్నానని ఓ యువకుడు పోలీసులకు చెప్పాడు. Also read: దీంతో చెన్నై పోలీసులు నగరవ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఫోన్ నంబర్ ఆధారంగా ఆరా తీశారు. ఆ వ్యక్తిని తిరువాన్మియూరుకు చెందిన తిరునావుక్కరసు అనే యువకుడిగా గుర్తించి ప్రశ్నించగా... మోదీ హత్యకు కుట్ర అంతా అబద్ధమని తేలింది. అతడికి నేర నేపథ్యమేమైనా ఉందా? అన్న కోణంలో స్థానికులను విచారించారు. తిరునావుక్కరసు ఏ పనీ చేయకుండా ఆ ప్రాంతంలో జులాయిగా తిరుగుతుంటాడని స్థానికులు చెప్పడంతో అతడిని అరెస్ట్ చేశారు. Also read:


By October 01, 2019 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chennai-man-arrested-for-fake-call-to-police-on-narendra-modi-attempt-to-murder/articleshow/71384997.cms

No comments