జగన్కు ఐవైఆర్ కృష్ణారావు స్పెషల్ రిక్వెస్ట్.. బాబుపై సెటైర్లు

అర్చకులకు వంశపారంపర్య హక్కుల్ని కల్పిస్తూ జగన్ సర్కారు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2007లో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయంలో అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని తీసుకొచ్చారు. గత పదేళ్లుగా ఈ చట్టం అమలుకు నోచుకోలేదు. పాదయాత్ర సమయంలో అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పిస్తానన్న జగన్.. ఇచ్చిన మాట ప్రకారం.. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వామి స్వరూపానంద స్వాగతించారు. ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ కూడా ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. గ్రామీణ ప్రాంతంలోని చిన్న దేవాలయాల అర్చకుల చిరకాల వాంఛకు రూపం ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు గానూ... జగన్మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎప్పుడో రొటీన్గా రావాల్సిన ఉత్తర్వులు బాబు వైఖరి వల్ల ఇన్ని రోజులు ఆలస్యమైందన్నారు. ‘‘ఆలయ పరిరక్షణ ఉద్యమాన్ని నడిపి బలవంతుడైన నిరంకుశ ముఖ్యమంత్రిని ఢీకొని చిన్న దేవాలయాల మనుగడే తన జీవిత లక్ష్యంగా పనిచేసిన చిల్కూర్ బాలాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారి పుట్టిన రోజున ఈ ఉత్తర్వులు రావడం ముదావహం’’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘‘హిందూ ధర్మ పరిరక్షణ వ్యాప్తికి అవసరమైన ఇతర చర్యలు, దైవభక్తి కలిగిన వారితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయడం, అర్చకులకు కనీస వేతనం నెలకు 15000 (ప్రభుత్వ బడ్జెట్ అవసరం లేకుండా దీనిని ఏర్పరచవచ్చు), సమరసత సేవా సమితికి గ్రాంట్లు పునరుద్ధరించడం లాంటి నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకుంటారని ఆశిస్తున్నానని ఐవైఆర్ తెలిపారు. Read Also: ‘‘తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రమణ దీక్షితులు అదే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర అర్చకుల సమస్య పై దృష్టి పెట్టి తన వాగ్దానానికి అనుగుణంగా సత్వర చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాన’’ని మాజీ చీఫ్ సెక్రటరీ ట్వీట్ చేశారు.
By October 22, 2019 at 09:49AM
No comments