Breaking News

భర్తను వదిలేసి ప్రియుడితో పెళ్లి.. బిడ్డకు జన్మనిచ్చి మృతి


వివాహ కట్టుబాట్లను కాదనుకుని ప్రియుడే జీవితమనుకుని వెళ్లి మహిళ జీవితం విషాదంగా ముగిసింది. కట్టుకున్న భర్తను వదిలేసి ప్రియుడిని పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్న ఆమె బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు వదిలింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి జీవిత భాగస్వామిగా చేసుకున్న అమ్మాయిని కాపాడుకునేందుకు అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన గుర్తుగా బిడ్డను భర్తకు ఇచ్చి ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. Also Read: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం జెండావెంకటాపురం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ ట్రాక్టర్‌ డ్రైవర్‌ మామిండ్ల ప్రేమ్‌కుమార్, మందమర్రికి చెందిన ప్రవల్లిక (21) ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రవల్లిక తల్లిదండ్రులు ఆమె మేనబావకు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. అతడితో ఏడాది కాపురం చేసిన ప్రవల్లిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయినా ప్రియుడిపై మనసు చంపుకోలేక భర్త, బిడ్డను వదిలేసి ప్రేమ్‌కుమార్‌ దగ్గరికి వెళ్లిపోయింది. వారిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని మంచిర్యాలలోని గాంధీనగర్‌లో కాపురం పెట్టారు. కొద్దికాలానికి గర్భం దాల్చిన ప్రవల్లిక శనివారం ప్రసవం కోసం హన్మకొండలోని ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆమెకు సిజేరియన్ చేయాలని, రక్తం కావాలని చెప్పడంతో ప్రేమ్‌కుమార్ వరంగల్‌లోని ఎంజీఎం బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లి ఓ బాటిల్ తెచ్చాడు. Also Read: ఒక్క బాటిల్ సరిపోదని డాక్టర్లు చెప్పడంతో నగరం మొత్తం తిరిగినా దొరకలేదు. మరోవైపు ప్రవల్లికకు సీరియస్ కావడంతో డాక్టర్లు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లి పరిస్థితి విషమంగా మారింది. శనివారం రాత్రి 10 గంటలకు ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఓ పక్క భార్య మృతి, మరోపక్క చేతిలో పసిగుడ్డును చూసి అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. తన కుటుంబసభ్యులతో పాటు ప్రవల్లిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పగా ఎవరూ స్పందించలేదు. అతడి పరిస్థితి చూసి చలించిన ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది రూ.5వేల నగదు అందించడంతో భార్య మృతదేహంతో ప్రేమ్‌కుమార్ అక్కడి నుంచి బయటపడ్డాడు. Also Read:


By October 14, 2019 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mancherial-married-woman-escaped-and-re-married-with-lover-death-after-delivery/articleshow/71573657.cms

No comments