అమెరికాలో హైదరాబాద్ మహిళ మృతి.. భర్తే చంపాడంటున్న బంధువులు
అత్తింటి వేధింపులకు మరో అబల బలైపోయింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో గజం వనిత(38) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో హైదరాబాద్ నాగోల్లోని సాయినగర్లో గల ఆమె పుట్టింట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. Also Read: గజం వనితకు కొన్నాళ్ల క్రితం రాచకొండ శివకుమార్ అనే వ్యక్తితో పెళ్లయింది. భర్త అమెరికాలోని ఉద్యోగం చేస్తుండటంతో వనిత అతడితో పాటు అక్కడికి వెళ్లిపోయింది. వారికి ఐదేళ్ల పాప కూడా ఉంది. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు అత్తమామలు కూడా వనితను వేధించడంతో ఆమె కొంతకాలం క్రితం పుట్టింటికి వచ్చేసింది. Also Read: ఎన్నాళ్లు భర్తకు దూరంగా ఉంటావ్, సర్దుకుపోయి ఉండు అని తల్లిదండ్రులు, బంధువులు నచ్చజెప్పడంతో వనిత ఈ ఏడాది జులై నెలలో పాపతో కలిసి భర్త వద్దకు వెళ్లింది. కొద్దిరోజుల పాటు తల్లిదండ్రులతో మాట్లాడిన వనిత.. సుమారు రెండు నెలలుగా ఎవరితోనూ కాంటాక్ట్లో లేదు. వనిత చనిపోయినట్లు సోమవారం సమాచారం రావడంతో ఆమె తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. Also Read: వనితను భర్త శివకుమారే మొహంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు అమెరికాలోని ఆమె బంధువులు అనుమానిస్తున్నారు. వారి ఫిర్యాదుతో నార్త్ కరోలినా పోలీసులు శివకుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అత్తింటి వేధింపులే వనితను బలి తీసుకున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. Also Read:
By October 07, 2019 at 11:44AM
No comments