Breaking News

`సైరా` టీమ్‌కి గ్రాండ్ పార్టీ.. తరలివచ్చిన టాలీవుడ్


మెగాస్టార్ మెగా హిట్ మూవీ . మెగాస్టార్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను కూడా సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ కలెక్షన్లు సాధిస్తున్న టీంకు కళాబంధు టీ సుబ్బిరామి రెడ్డి గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సైరా చిత్రయూనిట్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు పాల్గొన్నారు. దాదాపు 9 ఏళ్ల విరామం తరువాత ఖైదీ నెంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన 151వ సినిమా సైరా నరసింహారెడ్డితో మరొక బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. తండ్రి కలను నెరవేర్చేందుకు మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దాదాపు 250 కోట్ల బడ్జెట్‌లో ఈ హిస్టారికల్ డ్రామా తెరకెక్కింది. Also Read: గాంథీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ను అభినందిస్తూ సుబ్బిరామి రెడ్డి పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌ తో పాటు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌, నిర్మాత అల్లు అరవింద్‌, మురళీమోహన్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అల్లు అరవింద్‌... `ఇంత గొప్ప సినిమా మా కుటుంబం నుంచి రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. అదే సమయంలో నా మేనల్లుడు ఈ సినిమా తీయటం ఆనందంతో పాటు ఈర్ష్య కూడా ఉంది` అన్నాడు. ఈ సినిమాలకు తనకు మంచి పాత్ర ఇచ్చినందుకు నటుడు బ్రహ్మాజీ నిర్మాత రామ్‌ చరణ్‌, హీరో చిరంజీవిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. Also Read: ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. `150 చిత్రాలు చేసిన చిరంజీవికి అవన్నీ ఒక ఎత్తయితే 151వ సినిమా ‘సైరా’ మరో ఎత్తు. బ్రిటీషువారిని గడగడలాడించిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తీసుకుని తన సత్తా ఏంటో భారతదేశానికి చిరంజీవి చాటిచెప్పారు. ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. చిరంజీవి అలాంటి సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఇంత భారీ సినిమాను రామ్ చరణ్ లాంటి కుర్రాడు నిర్మించాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. పిల్లలకు మనం నేర్పించాలి. కానీ రామ్ చరణ్ చిన్న వయసులోనే సింపుల్, హంబుల్, డౌన్ టుఎర్త్, అఫెక్షనేట్, ఫినామినల్ పర్సన్. అటువంటి రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాడంటే అన్‌బిలీవబుల్. నేను దాదాపు 57 సంవత్సరాల నుంచి వ్యాపారాలు, రాజకీయాల్లో ఉన్నాను. కానీ, రామ్ చరణ్ లాంటి ధైర్యం చేయలేదు. దమ్మున్న, మనసున్న వ్యక్తి రామ్ చరణ్. నటుడిగా చేస్తూనే నిర్మాతగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. చరణ్ నుంచి ఈ మ్యాజిక్ అందరూ నేర్చుకోవాలి. చరణ్ పొగడ్తలు పట్టించుకోడు.ఇంకా ఇక్కడికి రాని చిత్రయూనిట్ అందరికీ నా ప్రశంసాభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. తెలుగు సినీ స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలి`. అన్నారు.


By October 10, 2019 at 12:45PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/t-subbirami-reddy-felicitates-sye-raa-narasimha-reddy-team/articleshow/71517316.cms

No comments