Breaking News

రౌడీషీటర్ దారుణహత్య.. ఉలిక్కిపడిన అనకాపల్లి


అనకాపల్లిలో రౌడీషీటర్ దారుణహత్యవిశాఖ జిల్లా అనకాపల్లిలో సోమవారం రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. గవరపాలెం రైతుబజార్‌ సమీపంలో ఉండే కర్రి రాజేశ్(34) అనే హత్య, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజేశ్ సోమవారం ఉదయం పార్కు సమీపంలో రాజేశ్‌ కొన ఊపిరితో పడి ఉండటాన్ని చూసిన ఆయన తండ్రి షాకయ్యాడు. కొడుకును ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read: రాజేశ్ హత్య పాతకక్షల నేపథ్యంలోనే జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్రి రాజేష్‌ 2013లో కశింకోటకు చెందిన జి.మహేష్‌ అనే వ్యక్తిని హత్యచేసిన కేసులో అరెస్టయ్యాడు. అప్పుడే పోలీసులు అతడిపై రౌడీషీట్ తెరిచారు. ఆ తర్వాత గవరపాలెంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల్లో రాజేశ్‌పై ప్రత్యర్థి వర్గం తీవ్రంగా దాడిచేసింది. కోలుకున్న తర్వాత రాజేశ్ ప్రత్యర్థులకు చెందిన ఓ బైక్ దహనం చేశాడు. దీంతో 2015లో పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ అమలు చేసి జైలుకు పంపారు. Also Read: ఏడాది తర్వాత బయటకు వచ్చిన అతడు ప్రస్తుతం ఎలాంటి గొడవలకు వెళ్లకుండా కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ నేఫథ్యంలో రాజేశ్ హత్యకు గురికావడం పట్టణంలో కలకలం రేపుతోంది. దుండగులు ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టడంతో రాజేశ్ చెవులు, ముక్కులో నుంచి తీవ్ర రక్తస్రావమైనట్లు తెలుస్తోంది. రాజేశ్ హత్యపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. Also Read:


By October 22, 2019 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rowdy-sheeter-brutally-murdered-in-anakapalle/articleshow/71699515.cms

No comments