Breaking News

APSRTCకి పండుగ కళ.. దసరా సీజన్లో భారీ ఆదాయం


దసరా సీజన్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ భారీ లాభాలను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో రోడ్డు రవాణా సంస్థకు రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది దసరా సీజన్లో వచ్చిన ఆదాయం కంటే ఈసారి రూ 20 కోట్లు ఎక్కువ ఆదాయం రావడం విశేషం. 2018 దసరా పండుగ సీజన్లో రూ.209 కోట్ల మేర ఆదాయం వచ్చింది. తెలంగాణలో కూడా లాభాలు పెరగడానికి కారణమైంది. టీఎస్ఆర్టీసీ సమ్మె కారణంగా.. హైదరాబాద్, తెలంగాణలోని ముఖ్య రూట్లకు ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులను పెంచింది. గతంలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లోనే ఎక్కువ మంది ప్రయాణికులు ఉండేవారు. కానీ తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రభావంతో.. ఏపీ నుంచి వచ్చే సమయంలో, తెలంగాణ నుంచి వెళ్లే సమయంలోనూ ప్రయాణికులతో బస్సులు కిటకిలాడాయి. దీంతో ఆక్యుపెన్సీ రేషియో ఏకంగా 103 శాతంగా నమోదైంది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 13 వరకు 5887 ప్రత్యేక సర్వీసులను నడిపింది. పండుగ రద్దీ, తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణంగా.. రోజూ సుమారు 40 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చే ఏపీఎస్ఆర్టీసీ ఈ సీజన్లో రోజుకు 75 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చింది.


By October 14, 2019 at 11:36AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tsrtc-strike-effect-apsrtc-earns-rs-229-crore-revenue-in-dasara-season/articleshow/71575557.cms

No comments