నెలకు రూ.8 వేలు లంచం ఇవ్వాలని బెదిరింపు.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ ఎస్సై రూ.15 వేల లంచం తీసుకుంటూ వలకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తాడు. మండల కేంద్రానికి చెందిన పరమేశ్ అనే వ్యక్తి పశువుల సంతను వేలం పాటలో దక్కించుకున్నాడు. తనకు ప్రతి నెలా రూ. 8 వేలు లంచం ఇవ్వాలని సంతను వేలంపాటలో దక్కించుకున్న పరమేశ్ను తెలకపల్లి ఎస్సై జి.వెంకటేశ్ డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరించాడు. రెండు నెలలకు గానూ రూ.16 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అంత మొత్తం ఇచ్చుకోలేనని పరమేశ్ బతిమాలాడు. కానీ ఎస్సై అంగీకరించకపోవడంతో.. చివరకు రూ.15 వేలు ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎస్సై లంచం కోసం డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపాడు. దీంతో పథకం ప్రకారం వలపన్ని పట్టుకున్నారు. ఎస్సైకు ఆయన ఇంట్లోనే పరమేశ్ రూ.15 వేలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై లంచాల బాగోతం గురించి ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయన ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.
By October 10, 2019 at 01:54PM
No comments