యువతి సజీవదహనం కేసులో 16 మందికి మరణశిక్ష

యువతిపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 16 మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. తనను ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడంటూ నుస్రత్ జహాన్ రఫీ అనే యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కేసు వాపసు తీసుకోవాలంటూ ప్రిన్సిపాల్ మద్దతుదారులు ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినా బాధితురాలు వెనక్కి తగ్గలేదు. Also Read: దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 6వ కాలేజీలో కొందరు దుండగులు యువతిపై దాడికి పాల్పడ్డారు. తాడుతో కట్టేసి శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. దాదాపు 80శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతి ఐదురోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బంగ్లాదేశ్లో తీవ్ర కలకలం రేపింది. యువతిని సజీవ దహనం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేయడంతో ఆందోళనలు విరమించుకున్నారు. Also Read: ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించాలని దుండగులు ప్రయత్నించారని, అయితే బాధితురాలు మెట్లపై నుంచి పరుగెత్తుకుంటూ రావడంతో మంటలు చెలరేగి తీవ్రంగా కాలిపోయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసును విచారించిన ఫాస్ట్ట్రాక్ కోర్టు కేవలం 62 రోజుల్లోనే తీర్పు వెలువరించింది. అయితే దీనిపై తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని దోషుల తరపు న్యాయవాదులు చెబుతున్నారు. Also Read:
By October 25, 2019 at 09:25AM
No comments