Breaking News

క్షుద్రపూజల పేరుతో బాలుడి హత్య.. తండ్రీకొడుకుల ఘాతుకం


పశ్చిమబెంగాల్‌లోని క్షుద్రపూజల కలకలం రేపింది. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఖరగ్‌పూర్‌లో క్షుద్రపూజలు నేర్చుకునే నేపధ్యంలో తండ్రీకొడుకు ఓ బాలుడిని దారుణంగా హత్య చేశారు. పాత మలంచాలోని నిరంజన్‌బాన్ ప్రాంతంలో సవన్‌నాయక్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడి కుమారుడు రుద్రనాయక్ శుక్రవారం సాయంత్రం కనిపించకుండా పోయాడు. Also Read: దీంతో స్థానికుల సాయంతో చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతికినా బాలుడు కనిపించలేదు. ఆదివారం స్థానికంగా ఉండే రతన్‌నాయక్ అనే వ్యక్తి ఇంట్లో రుద్రనాయక్ రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పాడు. రతన్ నాయక్ ఇంట్లో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు బయటపడటంతో రతన్‌ నాయక్, ఆయన కుమారుడు క్షుద్ర విద్యలు నేర్చుకోవడం కోసమే రుద్రనాయక్‌కు బలి ఇచ్చినట్లు స్థానికులు అనుమానించారు. Also Read: దీంతో చుట్టుపక్కల వారంతా రతన్ నాయక్ ఇంటిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందున్న బైక్‌లను తగులపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. రుద్రనాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రతన్ నాయక్, ఆయన కుమారుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. Also Read:


By September 23, 2019 at 12:59PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/7-yr-old-boy-killed-in-west-bengal-due-to-black-magic-performance/articleshow/71255884.cms

No comments