Breaking News

పెళ్లి వేడుకలో కాల్పులు.. బాలుడి మృతి, ముగ్గురికి గాయాలు


పంజాబ్‌లోని పట్టణంలోని ఓ పెళ్లి వేడుకలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతాగ్రాతుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. Also Read: శనివారం జరిగిన పెళ్లి రిసెప్షన్‌లో అంకుష్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ చిందులు వేస్తున్న సమయంలో గుర్లాల్ సింగ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి అక్కడి వచ్చి తుపాకీలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో లోవ్‌ప్రీత్ సింగ్(16) అనే మైనర్ బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అంకుష్‌తో పాటు కాల్పులు జరిపిన గుర్లాల్ సింగ్, అతడి స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. Also Read: అంకుష్, గుర్లాల్ సింగ్ మధ్య పాతకక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. సంతోషంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో హఠాత్తుగా చోటుచేసుకున్న కాల్పులు విషాదం నింపాయి. Also Read:


By September 09, 2019 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/firing-at-marriage-function-in-punjab-minor-boy-killed-3-injured/articleshow/71041594.cms

No comments