Breaking News

భర్తను వదిలేసి ప్రియుడితో అఫైర్.. వేధిస్తున్నాడని అన్నతో కలిసి హత్య


అక్రమ సంబంధాన్ని వదులుకోవడానికి అంగీకరించని ప్రియుడిని ఓ మహిళ తన తమ్ముడితో కలిసి హత్య చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని అమర్ కాలనీలో బుధవారం జరిగింది. ఢిల్లీకి చెందిన అనిత(25) విబేధాల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది. కొద్ది నెలల క్రితం ఆమెకు నేపాల్‌కు చెందిన సునీల్ అనే వ్యక్తితో పరిచమయ్యాడు. చనువు పెరగడంతో వారిద్దరూ అమర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. సునీల్‌ సాకేల్ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. Also Read: ఇటీవల అనిత, సునీల్‌ మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో అనిత అతడితో సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పగా అతడి తిరస్కరించడంతో పాటు బంధాన్ని కొనసాగించాలంటూ వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన అనిత ప్రియుడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన అన్న బిజయ్ ఛెత్రి (30), బంధువు రాజేందర్ ఛెత్రి (30) సహాయం తీసుకుంది. సెప్టెంబర్ 9వ తేదీన రాత్రి సమయంలో గ్రేటర్ నోయిడాలోని తన స్నేహితురాలిని కలిసొస్తానని ప్రియుడికి చెప్పి అనిత బయటకు వెళ్లింది. Also Read: ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సునీల్‌పై బిజయ్, రాజేందర్ దాడి చేసి చంపేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చిన అనిత తన ప్రియుడిని ఎవరో చంపేశారని పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో డిప్యూటీ కమిషనర్ చిన్మోయ్ బిస్వాల్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. Also Read: విచారణలో అనిత తడబడుతూ సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. దీంతో గట్టిగా నిలదీయగా సునీల్‌ను తన అన్న, బంధువు సాయంతో తానే హత్య చేయించినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి అనితను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బిజయ్ ఛెత్రి, రాజేందర్ ఛెత్రి(30)ని పశ్చిమబెంగాల్‌లోని కాలింపాగ్‌లో అదుపులోకి తీసకున్నారు.


By September 19, 2019 at 09:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/delhi-woman-relatives-arrest-for-killing-her-live-in-partner/articleshow/71195145.cms

No comments