Breaking News

అన్నంలో విషం కలిపి... అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య


వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తకే విషమిచ్చి చంపేసిందో ఇల్లాలు. తాత్కాలిక సుఖం కోసం పవిత్రమైన వివాహ బంధానికే మాయనిమచ్చ తెచ్చి ఇప్పుడు ప్రియుడితో కలిసి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుపాలు కావడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో వెలుగుచూసింది. Also read: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం కోబల్‌తండా శివారులోని గుడిసెల తండాకు చెందిన మాలోత్ మోహన్‌(30)కి భార్య పావని, ఇద్దరు కొడుకులున్నారు. పావతి కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన అజ్మీర శ్రీను అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్తలేని సమయంలో ఇంట్లోనే ప్రియుడితో రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం మోహన్‌కు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె అనైతిక బంధాన్ని కొనసాగించడంతో కొద్దిరోజుల క్రితం పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. Also read: పద్ధతి మార్చుకుని భర్తతో సజావుగా కాపురం చేసుకోవాలని పెద్దలు చెప్పడంతో పావని సరేనంది. అయితే తన అక్రమ సంబంధాన్ని నలుగురికి తెలిసేలా చేయడంతో పాటు ప్రియుడిని కలిసేందుకు అడ్డొస్తున్నాడన్న కోపంతో భర్తపై ఆమె పగ పెంచుకుంది. దీంతో అతడిని అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని పథకం వేసింది. బుధవారం భర్తకు పెట్టిన భోజనంలో విషం కలిపింది. అది తిన్న కాసేపటితో మోహన్ నురగలు కక్కుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో అతడి తల్లి గుర్తించి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే పరిస్థితి విషమించడంతో మోహన్ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. మోహన్ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టులో విషాహారం తినడం వల్లే అతడు చనిపోయినట్లు తేలడంతో భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి తానే చంపినట్లు ఆమె అంగీకరించింది. దీంతో గూడూరు ఎస్ఐ యాసిన్ నిందితులపై హత్యకేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. Also read:


By September 27, 2019 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-woman-kills-husband-with-poision-food-due-to-illegal-affair/articleshow/71322530.cms

No comments