Breaking News

అందుకే మనం ఎటూ కాకుండాపోయాం- అనసూయ


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రముఖ నటి, యాంకర్ గళం విప్పిన సంగతి తెలిసిందే. ‘ఇప్పుడే సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకున్నా.. యురేనియం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కావాలంట. సో, నేచురల్‌గా పీల్చే స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపి.. ఎలక్ట్రిక్ పరికరాల ద్వారా రానున్న రోజుల్లో కొనుక్కునే వాళ్లకే పీల్చడానికి గాలి లేకపోతే ఊపిరి ఆడక చావు.. అంతేగా??. ఇదేగా మన భవిష్యత్తు?? ఎలా అనుమతిస్తున్నారు సార్ ఇదంతా?? ఆలోచించడానికే భయం వేయలేదా?’ అంటూ ఘాటుగానే అనసూయ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీ్ట్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌‌లను అనసూయ ట్యాగ్ చేశారు. అయితే, జోగు రామన్న తెలంగాణ అటవీ శాఖ మంత్రి అనుకొని అనసూయ ఆయన్ని ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. కానీ, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే మాత్రమే. దాంతో తన తప్పును తెలుసుకున్న అనసూయ ఆయనకు ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. రెంట్ అఫైర్స్‌పై తనకున్న అజ్ఞానాన్ని మన్నించి సమస్యపై తన ఇంటెన్షన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే సోషల్ మీడియా మొత్తంలో అనసూయ.. జోగు రామన్నకు క్షమాపణలు చెప్పిన వార్తలతోనే నిండిపోయిందట. ఈ విషయాన్ని అనసూయ ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ.. ‘హ్హ హ్హ.. ఏడవలేక నవ్వుతున్నా. ఇఫ్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని నా సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తే అన్నీ.. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సారీ చెప్పిన అనసూయ’ అనే వార్తలే ఉన్నాయి. ఇందుకు కదా మనం ఎటూ కాకుండాపోయింది. దేని గురించి ఫోకస్ పెట్టాలి దేని గురించి పెడుతున్నారు? అసలు ఎప్పుడు బాధ్యతగా ఫీల్ అయ్యేది?’ అని ప్రశ్నించారు. అనసూయ అభిప్రాయంలో ఆమె చెప్పింది నిజమే. కానీ ఆమె ఇలా మీడియా వర్గాలన్నింటి గురించి ఇలా అనడం కరెక్ట్ కాదు. అనసూయ చేసిన ట్వీట్ల గురించి చెప్పినప్పుడు అందులో నల్లమల అడవుల సమస్యను కూడా మీడియా వర్గాలు కవర్ చేస్తున్నాయి. అయితే ఆమె జోగు రామన్న ఏ పదవిలో ఉన్నారో తెలీక చేసిన ట్వీ్ట్ హైలైట్ అయింది. అయినప్పటికీ అసలు ఆమె దేని గురించి ట్వీట్ చేశారు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. అలాంటప్పుడు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? అని ప్రశ్నించడం సబబుగా అనిపించడంలేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ.. ఆ తర్వాత నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యాంకరింగ్ రంగంలో సుమ, ఝాన్సీ ఎలా పేరు తెచ్చుకున్నారో ఇప్పుడు అనసూయ, రష్మి కూడా అలాగే పాపులర్ అయ్యారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లకు విపరీతమైన స్పందన వస్తూ ఉంటుంది. అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీటికి భయపడే ఓసారి అనసూయ సోషల్ మీడియా నుంచి తప్పుకొన్నారు.


By September 14, 2019 at 09:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/social-media-is-filled-with-my-apology-news-only-when-are-we-going-to-feel-responsible-asks-anasuya-bharadwaj/articleshow/71121532.cms

No comments