Breaking News

అక్కని వేధిస్తే తిట్టారని.. చెల్లెలిపై అఘాయిత్యం


స్కూల్‌కి వెళ్తున్న విద్యార్థినిపై కొందరు యువకులు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో మండలంలో జరిగింది. పి.గన్నవరం మండలానికి సరిహద్దుల్లో ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని 16వ తేదీన సైకిల్‌పై స్కూల్‌కి వెళ్తోంది. వాడ్రేవుపల్లి శివారులో గాడి రాజు, కర్రి చందు, మల్లాడి రామకృష్ణ అనే ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. రాజు ఆమె చేతిపై కత్తితో గాయం చేసి పుస్తకాల సంచిని కోసేశాడు. దీంతో బాధితురాలు కేకలు పెట్టగా మిగిలిన ఇద్దరు ఆమె నోరునొక్కి, కాళ్లు చేతులు పట్టుకున్నారు. రాజు ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించగా బాధితురాలు తప్పించుకుని పారిపోయింది. Also Read: అదే సమయంలో అటుగా కొందరు స్థానికులు రావడంతో నిందితులు పారిపోయారు. ఆ బాలిక ఇంటికి వెళ్లి తండ్రికి విషయం చెప్పడంతో ఆయన స్కూల్ హెడ్‌మాస్టర్‌కి చెప్పాడు. దీంతో ఆయన గురువారం పి.గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజు, చందు, రామకృష్ణలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన రాజు గతంలో బాలిక అక్కను వేధించేవాడని, ఈ విషయంపై అప్పట్లో ఆమె తండ్రి పెద్దల మధ్య పంచాయతీ పెట్టి అతడిని మందలించినట్లు తెలుస్తోంది. ఆ కక్షను మనసులో పెట్టుకునే రాజు ఇప్పుడు ఆమె చెల్లిపై అఘాయిత్యానికి యత్నించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు. Also Read:


By September 20, 2019 at 11:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/east-godavari-man-rape-attempt-on-school-girl-3-held/articleshow/71213875.cms

No comments