Breaking News

ఓవర్ స్పీడ్‌తో కారు ఢీకొన్న డీసీఎం.. ముగ్గురి మృతి


జనగామ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్‌స్టేషన్ సమీపంలో కారు-డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహబూబాబాద్‌కు చెందిన పెనుగొండ గణేశ్(60), పెనుగొండ సుకన్య(38)తో పాటు కారు డ్రైవర్ నజీర్ ప్రాణాలు కోల్పోయారు. Also Read: ఈ ప్రమాదంలో మంజూష, శ్రీలత అనే మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలిచి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకోగానే దేవరుప్పుల పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. బాధితుల సమాచారం తెలుసుకుని వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. డీసీఎం ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. Also Read:


By September 19, 2019 at 09:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/uncontrolled-dcm-hits-car-in-jangaon-district-3-died/articleshow/71195477.cms

No comments