Breaking News

ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మాజీ సీఎస్ ట్వీట్!


ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తీరును విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అజెండాను తన అజెండాగా మోస్తూ ముందుకెళ్తే.. 2019 ఎన్నికల్లో ఇచ్చిన ఒక సదావకాశాన్ని బీజేపీ దుర్వినియోగం చేసుకుని.. రాజకీయంగా నిర్వీర్యం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. గతంలో టీడీపీని తీవ్రంగా విమర్శిస్తూ బీజేపీలో చేరిన ఐవైఆర్.. ఇప్పుడు కాషాయ పార్టీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. ఐవైఆర్ చేసిన ట్వీట్‌ను బట్టి.. ఆయన వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ పొందాక.. ఆయన బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవికి ఎంపికయ్యారు. ఆ సమయంలో టీడీపీని, చంద్రబాబును విమర్శిస్తూ ఇదే తరహాలో ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకు దూరమైంది. టీడీపీ చేపట్టిన ‘ఛలో ఆత్మకూరు’పై జాతీయ మీడియా సైతం ఫోకస్ పెట్టేలా చేయడంలో చంద్రబాబు సఫలీకృతం అయ్యారని మరో ట్వీట్‌లో ఐవైఆర్ పేర్కొన్నారు. ఎవరు కవరేజీ ఇచ్చిన ఇవ్వకపోయినా.. చంద్రబాబు నేషనల్ మీడియా కవరేజీని మాత్రం పొందుతున్నారని ఆయన తెలిపారు.


By September 13, 2019 at 12:02PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/if-tdp-agenda-becomes-bjp-agenda-in-ap-it-would-end-up-as-political-hirakiri-for-the-party-says-iyr-krishna-rao/articleshow/71108059.cms

No comments