Breaking News

100 రోజులే అయ్యింది బాబు గారూ.. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు?: విజయసాయి


చలో ఆత్మకూరు కార్యక్రమానికి టీడీపీ పిలుపు ఇచ్చిన వేళ.. చంద్రబాబు టార్గెట్‌గా ట్వీట్ వార్ ప్రారంభించారు. యరపతినేని, కోడెల, దూడలను రక్షించడం కోసమే ఈ డ్రామా అంతా అని ఎద్దేవా చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ.. వంద రోజులకే ఇలా అయితే ఎలా? ఐదేళ్లు ఎలా తట్టుకుంటారంటూ.. చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎలక్షన్లకు మూడు నెలల ముందు చేయాల్సిన అతి మొత్తం ఇప్పుడే మొదలు పెట్టారంటూ చురకలు అంటించారు. నిద్ర పట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరాడట. చంద్రబాబు, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం అలాగే ఉందంటూ విజయసాయి సెటైర్లు వేశారు. ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? అంటూ టీడీపీ నేతలను విజయసాయి ప్రశ్నించారు. జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు వేశారని ఆరోపించారు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు ఏంటని నిలదీశారు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని టీడీపీ నేతలు శాపాలు పెడుతున్నారని విజయసాయి ఆరోపించారు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారని చంద్రబాబు, నారా లోకేశ్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్లు పెట్టారు. Read Also:


By September 11, 2019 at 12:05PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-is-trying-to-blame-ysrcp-govt-vijayasai-reddy-fires-on-chandrababu-naidu/articleshow/71076575.cms

No comments