Breaking News

TDP నేతల నోరు మూయించేలా జగన్ నిర్ణయం, గతానికి భిన్నంగా పెన్షన్ల అందజేత!


ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఫించన్ల పెంపు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. రూ.2000 ఇస్తోన్న పెన్షన్‌ను రూ.2250కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏటా రూ.250 చొప్పున పెంచుతూ పోతామని జగన్ తెలిపారు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండు నెలల్లో పెన్షన్ల విడుదలలో కాస్త జాప్యం తలెత్తింది. ఫించన్లకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా పేరు మార్చిన జగన్ సర్కారు.. జూలైలో రాజశేఖరెడ్డి జయంతి రోజున అంటే జూలై 8న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఆ రోజే లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఒకటో తేదిన లబ్ధి దారులకు అందేవి. జగన్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ల విడుదల ఆలస్యం కావడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. తమ హయాంలో పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్లు, వీఆర్వోలు ఒకటో తేదిన పెన్షన్లు అందించేవారని, ఇప్పుడు వారం గడిచినా పెన్షన్లు అందడం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ విమర్శలకు సీఎం వైఎస్ జగన్ సరైన సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి నేరుగా లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే పెన్షన్లు అందనున్నాయి. ఇక నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తారు. సెప్టెంబర్లో పెన్షన్ల విడుదల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 1280 కోట్లను విడుదల చేసింది. ఫించన్లను అందజేసే కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్లు, వీఆర్వోలు కూడా పాల్గొంటారు. Read Also:


By August 30, 2019 at 08:53AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ysr-pension-kanuka-village-and-ward-volunteers-to-distribute-pensions-in-andhra-pradesh/articleshow/70902965.cms

No comments