Breaking News

వైజాగ్‌లో హైటెక్ వ్యభిచారం.. విమానాల్లో వచ్చి లగ్జరీ హోటళ్లలో దందా


సాగర నగరంలో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ పద్ధతిలో కొనసాగుతున్న వ్యభిచార దందాను వైజాగ్ పోలీసులు చేధించారు. ముంబయి, బెంగళూరు, కోల్‌కతా నగరాల నుంచి అమ్మాయిలను విమానాల్లో విశాఖకు తీసుకొస్తున్న ముఠా వారిని లగ్జరీ హోటళ్లలో ఉంచి చేయిస్తోంది. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాను టూటౌన్ పోలీసులు చేధించి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లలో కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందుతూనే ఉంది. అయితే నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాలో వ్యవహరిస్తుండటంతో వారిని పట్టుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో పోలీసులు ఇటీవల కాలంలో విమానాల ద్వారా నగరానికి వచ్చే కొత్తవాళ్లపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల 20న ముంబయి నుంచి ఓ యువతి వైజాగ్ చేరుకుని అల్లిపురంలోని విశాఖ ఇన్ హోటల్‌కు వెళ్లింది. 22వ తేదీన బెంగళూరు నుంచి మరో యువతి కూడా విమానంలో వైజాగ్‌ చేరుకుని అదే హోటల్‌కు వెళ్లింది. వారిద్దరి కోసం రూమ్స్ ముందే బుక్ చేసి ఉన్నాయి. రెండ్రోజుల పాటు ఆ యువతుల గదుల్లోకి అనేక మంది యువకులు వెళ్లి రావడంపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో టూటౌన్ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి రైడ్ చేయగా ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న విటులు పారిపోయారు. దీంతో పోలీసులు ఆ అమ్మాయిలను అరెస్ట్ చేసి విచారించగా హైటెక్ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా గురించి తమకెలాంటి సమాచారం లేదని, రిషి అనే వ్యక్తి ఫోన్లో చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్లి వ్యభిచారం చేస్తామని వారు చెప్పారు. విమాన టిక్కెట్లు, హోటల్ రూమ్స్ అన్నీ రిషే బుక్ చేస్తాడని, పని పూర్తయ్యాక విటుడికి రూ.1500 చొప్పున తమకు ఇస్తాడని తెలిపారు. విటులతో తమకు నేరుగా సంబంధాలు ఉండవని, వారితో సంప్రదింపులన్నీ రిషే చూసుకుంటాడని చెప్పారు. విచారణ అనంతరం పోలీసులు యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఈ సెక్స్ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా ఉన్న రిషి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


By August 28, 2019 at 12:06PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/prostitution-racket-busted-by-viag-police-two-women-arrested/articleshow/70871217.cms

No comments