Breaking News

కొలువుదీరిన కర్ణాటక కొత్త కేబినెట్.. మాజీ సీఎం షెట్టార్, శ్రీరాములుకు ఛాన్స్


కర్ణాటకలో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. మంగళవారం రాజ్‌భవన్‌లో మంత్రులుగా 17మంది ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులతో గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణం చేయించారు. మంత్రివర్గంలో బీ.శ్రీరాములు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేష్‌, సహా మొత్తం 17 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటూ జగదీష్ షెట్టార్, కెఎస్.ఈశ్వరప్ప, ఆర్. అశోక, గోవింద్ మక్తప్ప కరజోల్, డాక్టర్ అశ్వథ్ నారాయణ్ సీఎన్, లక్ష్మణ్ సంగప్ప సవడి, ఎస్.సురేష్ కుమార్, వి.సోమన్న, సీటీ రవి, బసవరాజ్ బొమ్మై, కోట శ్రీనివాస్ పూజారి, జేసీ మధు స్వామి,చంద్రకాంత గౌడ, ప్రభు చౌహన్, జె శశిఖళా అన్నాసాహెబ్ ఉన్నారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. జులై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడియూరప్ప.. 29న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. కొత్త మంత్రి వర్గం మాత్రం ఏర్పాటు కాలేదు. మూడు వారాల పాటూ కేబినెట్‌పై కసరత్తు చేసిన సీఎం యడియూరప్ప.. 17మంది జాబితాను అధిష్టానానికి పంపించారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రివర్గం కొలువు దీరడంతో ఇక పూర్తిస్థాయి పాలనపై ఫోకస్ పెట్టనున్నారు.


By August 20, 2019 at 12:33PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-cabinet-expansion-17-bjp-leaders-takes-oath-as-ministers/articleshow/70750218.cms

No comments