Breaking News

రూ.3లక్షల అప్పు తీసుకున్నాడు.. తిరిగివ్వాలని అడిగితే ప్రాణం తీశాడు


మూడు నెలల్లో తిరిగిచ్చేస్తానని చెప్పి తీసుకున్న రూ.3లక్షల అప్పును తిరిగివ్వాలని స్నేహితుడు ఒత్తిడి తీసుకురావడంతో అతడిని దారుణంగా చేశాడో వ్యక్తి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్నేహితుడే హంతుకుడిని తెలిసి పోలీసులు షాకయ్యారు. కడ్తాల మండలం పల్లెచెల్కతండాకు చెందిన బిచ్చానాయక్‌, ఎల్బీనగర్‌కు చెందిన కిట్టిగౌరు రవి(30) ఆటోడ్రైవర్లు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఈ క్రమంలో రవి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల తర్వాత రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో ఇటీవల కాలిన స్థితిలో గుర్తించిన ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అది రవి మృతదేహమే అని కుటుంబసభ్యులు కూడా నిర్ధారించడంతో అనుమానాస్పద కేసుగా నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. రవి కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రాథమిక ఆధారాల ప్రకారం బిచ్చానాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. రవి దగ్గర రూ.3లక్షల అప్పు తీసుకున్నానని, వాటిని తీర్చాలని ఒత్తిడి తేవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నానని, జులై 22న ఆటోలో రింగ్‌రోడ్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి చంపేశానని చెప్పాడు. మృతదేహన్ని ఆటోలో కుర్మిద్ద తీసుకెళ్లి కాల్చేసినట్లు తెలిపాడు. నిందితుడిని గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు అనంతరం రిమాండ్‌కు తరలించారు.


By August 02, 2019 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-auto-driver-kills-friend-due-to-debt-pressure/articleshow/70493225.cms

No comments