వరద ముంపులో కేరళ, మహారాష్ట్ర.. రూ.10కోట్ల సాయం ప్రకటించి షిర్టీ ట్రస్టు

రెండు వారాల క్రితం వరకు వర్షాలు లేక దేవుళ్లకు మొక్కిన ప్రజలే నేడు కాస్త విరామం ఇవ్వు వరుణదేవా.. అంటూ చేతులు జోడించి ప్రార్థనలు చేసిన కేరళ, మహారాష్ట్ర, ప్రజలు.. నేడు కాస్త విరామం తీసుకో వరుణ దేవా అని వేడుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో వరుణుడు చేస్తున్న విధ్వంసం మామూలుగా లేదు మరి. కుండపోత వర్గాలకు దక్షిణాదిలో కేరళ, కర్ణాటక రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వరద బీభత్సానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా వరదల కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఇప్పటివరకు సుమారు 114 మంది మృతిచెందారు. వరద నీటిలో మరికొంత మంది గల్లంతయ్యారు. చాలాచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వరద ముంపులో చిక్కుకున్న ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సహా పలు సహాయ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కేరళలోనే ఇప్పటివరకు సుమారు లక్షన్నర మందిని వరద సహాయ కేంద్రాలకు తరలించారు. కోచి విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులు నిలిపివేశారు. వరద తగ్గుముఖం పడితే ఆదివారం మధ్యాహ్నం తర్వాత రాకపోకలు పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. కేరళలోని అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని నిండుకుండలా మారాయి. ఇప్పటికే 8జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో వరద మృతుల సంఖ్య 46 దాటింది. మహారాష్ట్రలోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకు 4లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల సహాయార్ధం షిర్టీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు రూ.10కోట్లు ప్రకటించింది. మరోవైపు వరద సహాయచర్యలపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
By August 11, 2019 at 11:05AM
No comments