TRSకు సీనియర్ నేత గుడ్ బై.. అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్కు సీనియర్ నేత షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. కొద్దిరోజులుగా తనపై అనుచరులపై దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. టీఆర్ఎస్లో అరాచకం పెరిగిపోయిందని.. క్రమశిక్షణ లేకుండా పోయిందన్నారు. పార్టీలో గౌరవం లేనప్పుడు పనిచేయడం కష్టమన్నారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్.. అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని.. కొందరి తీరు వల్లే టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నానన్నారు. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా తనను వేధించారని.. రామగుండంలో తన ఓటమికి బాల్క సుమన్, మరికొందరు నేతలు కారణమని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తోందన్నారు సత్యనారాయణ. సోమారపు సత్యనారాయణ 2009లో రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్కు మద్దతు పలికారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడంతో.. టీఆర్ఎస్లో చేరి టికెట్ దక్కించుకున్నారు. 2014లో రామగుండం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో ఓడిపోయారు. చందర్ టీఆర్ఎస్లో చేరడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ మారతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
By July 09, 2019 at 12:42PM
No comments