Breaking News

అధిక సంతానంతో ఊడిన కార్పోరేటర్ పదవి.. బీజేపీ అభ్యర్థికి బంపరాఫర్


తెలంగాణ రాష్ట్ర సమితికి సిటీ సివిల్ కోర్టు ఊహించని షాకిచ్చింది. 2016లో జరిగిన ఎన్నికల్లో కాచిగూడ డివిజన్ నుంచి కార్పోరేటర్‌గా గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కాల చైతన్య కన్నాపై న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు మాత్రమే సంతానం ఉండాలి. ఈ నిబంధనలకు విరుద్ధంగా చైతన్య కన్నాకు ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే ఆమె తన అఫిడవిట్లో మాత్రం ఇద్దరు సంతానంగానే పేర్కొన్నారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాచిగూడ డివిజన్‌ను మహిళలకు కేటాయించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉమారమేష్ యాదవ్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కాల చైతన్య కన్నా 1,810 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే చైతన్యకు ముగ్గురు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారని, అఫిడవిట్లో మాత్రం ఇద్దరే సంతానంగా పేర్కొన్నారని బీజేపీ అభ్యర్థి కోర్టుకెక్కారు. ముగ్గురు బిడ్డలకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్లు సంపాదించి న్యాయస్థానంలో సమర్పించారు. మూడేళ్ల పాటు కొనసాగిన ఈ కేసు విచారణలో భాగంగా చైతన్య కన్నా ఎన్నికల చెల్లదని ఎన్నికల ట్రైబ్యునల్ కోర్టు చీఫ్ జడ్జి సుమతల బుధవారం తీర్పుచెప్పారు. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఉమారమేష్ యాదవ్‌కు ఇకపై కార్పోరేటర్‌గా కొనసాగుతారని స్పష్టం చేశారు. చైతన్య కన్నా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని మూడేళ్లుగా తాము చేస్తున్న పోరాటం ఇప్పటికి ఫలించిందని ఉమా రమేష్ యాదవ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


By July 04, 2019 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ghmc-kachiguda-corporator-ekkala-chaitanya-disqualified-for-having-3-kids/articleshow/70067102.cms

No comments