Breaking News

నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు


రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఉందని పేర్కొంది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని కారణంగా రెండు మూడు రోజుల్లో ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా ఇంకా సరైన వర్షాలు కురవడం లేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జులై ప్రాంతంలోనూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కొనసాగుతోంది. అప్పుడప్పుడూ వర్షాలు కురుస్తున్నా చెరువులు, జలాశయాలు నిండంటం లేదు. దీని కారణంగా ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. బుధవారం తెలంగాణలోని 102 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. సరైన వర్షాలు లేకపోవడంతో చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం భద్రాచలంలో 5.8డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది.


By July 18, 2019 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/hyderabad-heavy-rain-forecast-for-telangana/articleshow/70269932.cms

No comments