Breaking News

టీడీపీ అధర్మపోరాటం చేసింది.. హోదా ముగిసిన అధ్యాయమే: సుజనాచౌదరి


భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేతలు స్వయంగా పార్టీలో చేరేందుకు వస్తున్నారని అన్నారు రాజ్యసభ ఎంపీ . టీడీపీని వదిలి బీజేపీలో చేరిన ఆయన ఆదివారం తొలిసారి అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా సుజనాచౌదరి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనన్నారు. ఇదే విషయాన్ని తాను టీడీపీలో ఉన్నప్పుడూ చెప్పినట్లు గుర్తుచేశారు. కేంద్రంపై టీడీపీ చేసింది ధర్మపోరాటం కాదని.. అధర్మపోరాటమని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, అందుకే చాలామంది నేతలు చేరేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు. తాను ఇప్పటివరకు పరోక్ష రాజకీయాల్లో ఉన్నానని, బీజేపీలో చేరికతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారని సుజనా చౌదరి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి చాలామంది నేతలు బీజేపీలో చేరేందుకు రెడీ ఉన్నారని తెలిపారు. ప్రత్యేక హోదాకు బదులు కేంద్ర ప్యాకేజీ ఇచ్చిందని, దాన్ని అంగీకరిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సుజనా అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కూడా విభజన చట్టంలో లేదన్నారు.


By July 14, 2019 at 12:42PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bjp-mp-sujana-chowdary-comments-on-tdp-dharma-poratam/articleshow/70213174.cms

No comments