Breaking News

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప.. సాయంత్రమే ప్రమాణస్వీకారం


కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తాను ప్రమాణస్వీకారం చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేత ప్రకటించారు. ఈరోజు ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన యడ్యూరప్ప.. గవర్నర్ వాజూభాయ్ వాలాతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఈరోజే అవకాశం ఇవ్వాలని యడ్డీ కోరగా.. గవర్నర్ ఓకే చెప్పేశారు. రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాయంత్రం 6-6.15 గంటల మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న తెలిపారు. ఇందుకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారని వెల్లడించారు. ఈరోజు యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కుమారస్వామి ప్రభుత్వం కూలిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు యడ్యూరప్ప సిద్దమైనా బీజేపీ అధిష్ఠానం అనుమతి ఇవ్వలేదు. రాజకీయ సంక్షోభంపై బీజేపీ ఆచితూచి ఆలోచిస్తుండగానే స్పీకర్ రమేష్‌కుమార్ రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో మేల్కొన్న బీజేపీ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్దమైంది.


By July 26, 2019 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-leader-yeddyurappa-to-take-oath-as-karnataka-cm-at-6pm-on-today/articleshow/70391037.cms

No comments