Breaking News

బాలయోగి ఆస్తుల్ని కాజేశా.. కేశినేని సంచలన పోస్ట్


విజయవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య ట్వీట్ల యుద్ధానికి పుల్‌స్టాప్ పడటం లేదు. ఎంపీ , ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల వార్ నడుస్తూనే ఉంది. వెంకన్న ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టగా.. ఎంపీ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వెంకన్నను మళ్లీ టార్గెట్ చేశారు.. ఆయన రెండు రోజుల క్రితం చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. మళ్లీ రెచ్చిపోయారు. నాని తన ట్వీట్‌లో ‘నేను బాలయోగి ఆస్తులు కాజేశానని.. ఒక్క ప్రబుద్ధుడు చెప్పింది యదార్థం. బాలయోగి కి ఉన్న ఆస్తులు నీతి,నిజాయితీ .విలువలు ,సిద్ధాంతాలు ప్రజల్ల పట్ల అంకితభావం,ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి.. వీటిని కాజేసి పాటిస్తున్నందుకు చాలా గర్వ పడుతున్నాను’అన్నారు. టీడీపీలో ఈ ఇద్దరు నేతల మధ్య ట్వీట్ వార్ జరిగింది. గతంలో పార్టీ కోసం కలిసి పనిచేసిన నేతలు ఇప్పుడు ఒకరిపై మరకొరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎమ్మెల్సీ కూడా గతంలో నాని వెంట ఉండేవారు.. తర్వాత బుద్దా చంద్రబాబుకి దగ్గరయ్యారు. ఆయనకు నాలుగు పదవులు దక్కాయట. అప్పటి నుంచి నాని, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు మొదలయ్యాయని బెజవాడ టాక్. నాని ఇలా సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలయ్యింది. మరి ట్వీట్ వార్‌కు అధినేత ఎలా బ్రేకులేస్తారో చూడాలి.


By July 16, 2019 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-mp-kesineni-nani-continue-his-tweet-attack-on-mlc-buddha-venkanna/articleshow/70238482.cms

No comments