Breaking News

అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఆత్మహత్య


కుమారుడు చదువుతున్న పాఠశాలలకు సెలవులు కావడంతో కొద్దిరోజులు పుట్టింట్లో, మెట్టినింట్లో గడుపుదామని వచ్చిన మహిళ బిల్డింగ్‌ పైనుంచి దూకిన ఘటన సరూర్‌నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గాంధీనగర్‌కు చెందిన గుర్రం ఎన్‌వి సురేష్‌ అమెరికాలోని టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడిని 2004లో సిరిసిల్ల గంభీరావుపేటకు చెందిన బ్యాంక్‌ ఉద్యోగి విజయకుమార్, శశికళ దంపతుల కుమార్తె శ్రీలేఖ (38)తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అమెరికాలోని టెక్సాస్‌లో సెటిల్ అయిన దంపతులకు 2008లో ధీరజ్ అనే కుమారుడు జన్మించాడు. బాలుడు దీర్ఘకాల అనారోగ్యానికి గురికావడంతో అమెరికాలోనే చికిత్స అందిస్తున్నారు. ధీరజ్ చదువుతున్న పాఠశాలకు సెలవులు కావడంతో సురేష్‌, శ్రీలక్ష్మి కుమారుడితో కలిసి ఈ నెల 1వ తేదీని హైదరాబాద్ వచ్చారు. కొత్తపేట హుడా కాలనీలోని శ్రీలక్ష్మికి తండ్రికి చెందిన ప్లాట్‌లో ఉంటున్నారు. కుమారుడి అనారోగ్యం కారణంగా మానసిక వేదన అనుభవిస్తున్న శ్రీలక్ష్మి మంగళవారం రాత్రి బిల్డింగ్ పైనుంచి దూకేసింది. ఈ విషయాన్ని సురేష్‌కు వాచ్‌మెన్ సమాచారం ఇవ్వడంతో అతడు వెంటనే అక్కడికి వచ్చి చూశాడు. రక్తపు మడుగులో పడివున్న శ్రీలక్ష్మి అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సురేష్‌ను విచారించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శ్రీలేఖ తండ్రి నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. తల్లి శశికళ అమెరికాలోనే చిన్న కుమార్తె వద్ద ఉంటోంది.


By July 04, 2019 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-nri-woman-commits-suicide-in-kothapet/articleshow/70068513.cms

No comments