Breaking News

నేటి నుంచే బోనాల జాతర.. గోల్కొండకు మంత్రుల రాక


తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నేటి నుంచి ప్రారంభం కానుంది. గోల్కొండలోని జగదాంబిక మహంకాళి ఆలయం నుంచి బోనాల జాతరను తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించనున్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్సావాల్లో భాగంగా లంగర్‌హౌజ్ నుంచి అమ్మవారి రథం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని ఆలయం వరకు కొనసాగనుంది. చోటాబజార్‌లో పూజారి అనంతచాలి ఇంట్లో నుంచి నగలను తీసుకెళ్లి అమ్మవారికి అలంకరిస్తారు. ఆలయ ఛైర్మన్ గోపిరెడ్డి వసంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఏర్పాట్లను ఘనంగా చేశారు. బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఖర్చుకు వెనకాడకుండా ఘనంగా నిర్వహిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల జాతర ఏర్పాట్లపై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ఆవరణలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో బోనాల ఏర్పాట్ల కోసం అన్ని శాఖలు కలిపి రూ.100కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహిస్తామని, దీనికి సంబంధించి 15వ తేదీలోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.


By July 04, 2019 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-bonalu-starts-today-in-golconda-fort/articleshow/70066566.cms

No comments