Breaking News

మద్యం మత్తులో ప్రేమికుడిని కొట్టి యువతిపై గ్యాంగ్ రేప్


తమిళనాడులో దారుణ ఘటన జరిగింది. రాత్రివేళ ఓ ప్రాంతంలో ప్రియురాలితో మాట్లాడుతున్న యువకుడిపై కొందరు దుండగులు దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విళ్లుపురం జిల్లా పల్లిచ్చేరిలో జరిగిన ఈ ఘటనకు పాల్పడిన నలుగురిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విళ్లుపురం జిల్లాలోని కండమంగలం ప్రాంతానికి చెందిన యువతి, యువకుడు నల్లూరిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఖాళీ సమయాల్లో పార్కులు, సినిమాలకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గురువారం రాత్రి ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు నల్లూరు రైల్వేగేట్ సమీపంలోని పల్లిచ్చేరి వద్దకు వెళ్లారు. అదే సమయంలోనే పల్లిచ్చేరి గ్రామానికి చెందిన నలుగురు యువకులు మద్యం మత్తులో అక్కడికి వచ్చిప్రేమికులను బెదిరించారు. యువకుడిని తీవ్రంగా కొట్టి యువతిపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని బాధితురాలు వేడుకున్నా వారు కనికరించలేదు. తీవ్ర గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్న యువకుడు తన స్నేహితుడికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. ఫ్రెండ్ వచ్చాక ఇద్దరూ కలిసి నలుగురు యువకులను ఎదిరించారు. దీంతో రెచ్చిపోయిన ఆ దుండుగులు ఆ ఇద్దరిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు యువకులు, అత్యాచారానికి గురైన యువతి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. కాసేపటి తర్వాత ఆ మార్గంలో వెళ్తున్న కొందరు బాధితులను గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న కండమంగలం పోలీసులు బాధితులను పరామర్శించారు. వారి నుంచి వివరాలు సేకరించి పల్లిచ్చేరి గ్రామానికి వెళ్లి నిందితులను గుర్తించారు. వీరిలో ఒకరైన అయ్యన్నార్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గ్రామానికి వచ్చారన్న సమాచారం తెలుసుకున్న మిగిలిన ముగ్గురు నిందితులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.


By June 22, 2019 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-gang-raped-in-tamilnadu-villupuram/articleshow/69900258.cms

No comments