Breaking News

పురిటినొప్పులు వచ్చేవరకు రేప్ జరిగినట్లు తెలీయలేదు


మతి స్థితిమం లేక ఇంటి వద్దనే ఉంటున్న గిరిజన బాలికపై అత్యాచారానికో కామాంధుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరించి తరుచూ అత్యాచారానికి పాల్పడిన అతడు ఆమెను గర్భవతిని చేశాడు. జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని ఓ గ్రామంలో మతి స్థిమితం లేని బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. వారు కూలీ పనులకు వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన పి.శివసత్యనారాయణ బాలికపై కన్నేశాడు. ఆమెను బెదిరించి తరుచూ అత్యాచారానికి పాల్పడేవాడు. తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని కూడా గుర్తించి తల్లిదండ్రులకు చెప్పలేని స్థితిలో ఉన్న బాలికకు ఈ నెల 25వ తేదీన కడుపునొప్పి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా బాలిక తొమ్మిది నెలల గర్భవతి అని, పురిటినొప్పులు వస్తున్నాయని డాక్టర్లు తెలిపారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ ప్రసవం చేయలేమని డాక్టర్లు చెప్పడంతో బాధితురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. బాలికను పరీక్షించిన రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పారు. సర్జరీ చేసి మృత శిశువును బయటకు తీశారు. బాధితురాలు మైనర్ కావడంతో డాక్టర్లు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలు, ఆమె తల్లిదండ్రులను విచారించి వివరాలు సేకరించారు. తమ కుమార్తె గర్భవతి అన్న సంగతి తమకు తెలియదని, ఏం జరిగిందని ఆమెను నిలదీయగా గ్రామానికే చెందిన శివసత్యనారాయణ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పిందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు అత్యాచార కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


By June 28, 2019 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mentally-challenged-tribal-girl-raped-by-men-in-east-godavari-district/articleshow/69984496.cms

No comments