Breaking News

యువీలో నాగచైతన్య నిజమేనా?


రెగ్యులర్‌గా సినిమాలు తీస్తూ వరుస హిట్స్ సాధిస్తోన్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ (వంశీ, ప్రమోద్) టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీ‌ని సంపాదించుకుంది. ఈ బ్యానర్ నుంచి త్వరలో ‘సాహో’ లాంటి ప్రెస్టీజియస్ చిత్రం రాబోతుంది. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు. మూడు వందలకోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ దృశ్యాలను రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఎక్స్ ప్రెస్ రాజా చిత్రానికి దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగచైతన్య ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫినిషింగ్ స్టేజ్లో స్టోరీ ఉన్నట్లు తెలిసింది. ఈ సినిమా చేసేందుకు నాగచైతన్య పచ్చ జెండా ఊపాడని సినీ ట్రేడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 



By March 14, 2019 at 05:23AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45118/naga-chaitanya.html

No comments