Breaking News

ఆర్ఎక్స్ 100 బ్యూటీకి షాకిచ్చారు


‘టైగర్ నాగేశ్వర్ రావు’ అనే పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతుంది.  టైగర్ నాగేశ్వర్ రావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు.

ఆ కథతోనే సినిమాను తెరకెక్కించనున్నారు. ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేమ్ దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను  తీసుకుంద్దాం అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ కాలేదు అంట.

ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు అని తెలుస్తుంది. బెల్లంకొండకు రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయ్ ఆ రెండు అయిపోయిన తరువాత ఈసినిమా ఉండబోతుంది. దీనికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. త్వరలోనే ఈసినిమా డీటెయిల్స్ తెలియనున్నాయి.



By March 26, 2019 at 08:42AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45295/payal-rajput.html

No comments