Breaking News

మహేష్, నమ్రత గొప్ప మనసు చాటుకున్నారు


650 మంది అంధ బాలలకు విందు ఏర్పాటు చేసిన మహేష్ నమ్రత దంపతులు

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత‌లు ఫిబ్రవరి10న తమ 14 వ పెళ్లిరోజు జరుపుకున్నారు. సేవా కార్యక్రమాల్లో, తమ వంతు సహాయంగా విరాళాలు ఇవ్వడంలో ఎప్పుడు ముందుండే మహేష్ - నమ్రత దంపతులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పిల్లలతో పంచుకున్నారు. 650 మంది అంధ బాలలకు ఆదివారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. బేగంపేటలోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు మహేష్ బాబు టీం ఈ విందు ఏర్పాట్లు చేశారు. మంచి మనసున్న మహేష్ - నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు మరింత ఆనందమయం అవ్వాలని అంతా ఆశీర్వదిస్తున్నారు. 



By February 11, 2019 at 11:27AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44678/mahesh-babu.html

No comments