Breaking News

‘47డేస్’ రెడీగా ఉండండి..!!


డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ‘47డేస్’

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ వైజాగ్, అరకు, గోవా, హైదారాబాద్‌లలో పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కంప్లీట్ టెక్నిషియన్స్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి టాక్ నడుస్తోంది. ఈ మూవీ అవుట్‌పుట్ తెలిసిన త్రిశూల్ సినిమా ఫ్యాన్సీ రేట్‌కు ఓవర్సీస్ హక్కులు దక్కించుకుంది.

తెలుగు ప్రేక్షకులకు ‘47డేస్’ చిత్రం సరికొత్త అనుభూతి ఇస్తుందని నమ్మకంగా చెబుతుంది చిత్ర యూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్ ముఖ్య కథాంశంగా వస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగా ఉంటాయని అంటుంది చిత్ర యూనిట్. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచే, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



By November 10, 2018 at 12:00PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43433/trisool-cinema.html

No comments