Breaking News

వీరరాఘవుడి టార్గెట్ ఇప్పుడు మెగాస్టారే!


ఒకనాడు వరుస మూసకొట్టుడు చిత్రాలు చేసిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఈమధ్య వైవిధ్యభరితమైన కథలను, పాత్రలను ఎంచుకుంటున్నారు. ‘టెంపర్‌’తో మొదలుపెట్టి ‘నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌, జైలవకుశ’ వంటి చిత్రాలతో తనలోని సత్తాని చాటాడు. ఇక ఆమధ్య ఎన్టీఆర్‌ అంటే కేవలం మాస్‌ హీరో అనే ఇమేజ్‌ ఉండేది. అందుకే ఓవర్‌సీస్‌లో కూడా ఆయన చిత్రాలు కలెక్షన్ల పరంగా పెద్ద ప్రభావం చూపేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయన చేస్తోన్న విభిన్నచిత్రాల ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆయన చేరువ అవుతున్నాడు. అది ‘అరవింద సమేత వీరరాఘవ’తో మరింత బలపడింది. త్రివిక్రమ్‌కి, ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్‌ ఈమూవీకి ఎంతో ప్లస్‌ అయింది. 

కాగా ‘అరవింద సమేత వీరరాఘవ’ తాజాగా చిరుని పక్కనపెట్టాడు. ఇప్పటివరకు ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌, బాహుబలి-ది బిగినింగ్‌, రంగస్థలం, ఖైదీ నెంబర్‌ 150, భరత్‌ అనే నేను’ చిత్రాలు ఎక్కువ గ్రాస్‌ని వసూలు చేశాయి. తాజాగా ‘వీరరాఘవుడు’, ‘భరత్‌ అనే నేను’ని దాటి రూ.159కోట్ల గ్రాస్‌తో ముందుకుదూసుకుపోయాడు. 164 కోట్లతో ఉన్న ‘ఖైదీనెంబర్‌ 150’కి ఈ చిత్రం దరిదాపుల్లో ఉంది. కేవలం మరో ఆరుకోట్లు వసూలు చేస్తే చిరు స్థానాన్ని ఎన్టీఆర్‌ ఆక్రమిస్తాడు. అందుకు మరో వారం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్‌ని సాధించిన చిత్రంగా ‘అరవింద సమేత వీరరాఘవ’ నిలవడం, ఎన్టీఆర్‌కి తన కెరీర్‌లో తొలి 150కోట్ల చిత్రంగా రికార్డులకు ఎక్కడంతో అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. 



By October 28, 2018 at 03:40PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43232/ntr.html

No comments