Breaking News

Hate Speech: విద్వేష ప్రసంగాలు ప్రమాదకరం.. వాటిని ఆపాల్సిందే: కేంద్రానికి సుప్రీం సూచన


దేశంలో విద్వేశ ప్రసంగాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని ఏ వర్గం చేసినా సమర్ధించరాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కోర్టు సూచించింది. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటీవల హరియాణాలోని నుహ్‌లో చెలరేగిన మత ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్ట్ పిటిషన్ దాఖలు చేశారు.

By August 12, 2023 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-to-centre-hate-speech-unacceptable-and-need-to-stop-it/articleshow/102664952.cms

No comments