Breaking News

29 మంది మణిపూర్ అమ్మాయిల బాధ్యత నాదే: కర్ణాటక మంత్రి


Manipur Girls: మణిపూర్‌లో 3 నెలలుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు సొంత రాష్ట్రానికి వెళ్లలేక ఎక్కడికక్కడే నిలిచిపోయారు. మరికొందరు మణిపూర్ అల్లర్ల భయానికి ఇతర రాష్ట్రాలకు ప్రాణ భయంతో పారిపోయారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకకు శరణార్థులుగా వచ్చిన మణిపూర్ అమ్మాయిల పట్ల.. ఆ రాష్ట్ర మంత్రి తీవ్రంగా చలించిపోయారు. వారి చదువులకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని.. తన పుట్టిన రోజు సందర్భంగా హామీ ఇచ్చారు.

By August 02, 2023 at 12:40PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-minister-to-sponsor-education-of-29-girls-who-came-from-violence-hit-manipur/articleshow/102342631.cms

No comments