Breaking News

మళ్లీ మొదలైన కరోనా అలజడి.. మహారాష్ట్రలో 1300కుపైగా కేసులు


మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. అక్కడ శనివారం ఒక్కరోజే 13 వందలకుపైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. పైగా శనివారం 31 వేల మందికిపైగా అనుమానితులకు కరోనా పరీక్షలు జరిపారు. దాదాపు మూడు నెలల తర్వాత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తుంది. కేసులతో పాటు మరణాలు కూడా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

By June 05, 2022 at 07:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-logs-1357-fresh-covid-cases-with-one-death/articleshow/92012923.cms

No comments