Mundka Fire: ఢిల్లీ అగ్నిప్రమాదం.. 27కి చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 27కి పెరిగింది. ఈ ప్రమాదంలో మరో 12 మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం మంటలు ప్రారంభం కాగా.. 30 ఫైరింజన్లు అర్ధరాత్రి వరకూ మంటలను అదుపులోకి తేవడానికి శ్రమించాల్సి వచ్చింది. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందించనున్నారు.
By May 14, 2022 at 07:11AM
By May 14, 2022 at 07:11AM
No comments