Breaking News

Cyber Attack స్పైస్​జెట్​పై సైబర్ దాడి.. నిలిచిపోయిన ఫ్లైట్స్.. ప్రయాణికులు పడిగాపులు


మంగళవారం రాత్రి స్పైస్‌జెట్ విమాన వ్యవస్థపై సైబర్ నేరగాళ్లు దాడికి పాల్పడ్డారు. సైబర్ దాడి జరగడంతో విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం ఉదయం షెడ్యూల్ చేసిన విమానాలు ఇంత వరకూ కదల్లేదు. కొన్ని సిస్టమ్స్‌పై రాన్సమ్‌వేర్ దాడి జరిగినట్టు గుర్తించారు. పరిస్థితి సరిచేశామని ఆ సంస్థ ప్రకటించినా.. విమానాలు నడవడం లేదని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

By May 25, 2022 at 11:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/spicejet-flights-delayed-and-hundreds-of-passengers-stranded-due-to-ransomware-attack/articleshow/91781887.cms

No comments