న్యాయం జరగకపోతే అరాచకం పెరుగుతుంది : జస్టిస్ ఎన్వీ రమణ

న్యాయాన్ని తిరస్కరిస్తే అది అరాచకానికి దారి తీస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆయన శ్రీనగర్లోని కొత్త హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వివాదాలను వెంటనే పరిష్కరించాలన్నారు. వివాదాలను వెంటనే పరిష్కరించడం మంచి ప్రజాస్వామ్యానికి లక్షణమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే జిల్లా కోర్టులే న్యాయవ్యవస్థకు పునాదని, అవి బలంగా ఉండాలన్నారు. అలాగే కోర్టుల్లో మౌలిక సదుపాయాలు పెరగాలన్నారు. ఇప్పటికీ చాలా కోర్టులు శిథిలమైన భవనాల్లో నడుస్తున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
By May 15, 2022 at 09:34AM
By May 15, 2022 at 09:34AM
No comments