Breaking News

రంజాన్ ఎఫెక్ట్.. కిక్కిరిసిన రైళ్లు.. టాప్‌ మీదకు ఎక్కేసిన ప్రయాణికులు..!


రంజాన్ పండుగ సందర్భంగా బంగ్లాదేశ్‌లో ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్‌లు కిక్కిరిసిపోయాయి. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు వేలాది మంది జనం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కానీ తగినన్ని రైళ్లు లేకపోవడంతో ట్రైన్స్ టాప్‌పైకి ఎక్కి ప్రయాణాలు చేశారు. కొందరు నిలబడి, వేలాడుతూ కూడా ప్రయాణించారు. ఇక అక్కడ మార్కెట్లు కూడా రద్దీగా కనిపించాయి. ఎక్కడ చూసినా పండుగ సందడి కనిపించింది. ఈద్‌ను బాగా జరుపుకోవాలని చాలామంది తమ గ్రామాలకు పయనం అయ్యారు.

By May 02, 2022 at 11:29PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/thousands-rushed-to-dhaka-main-train-station-to-head-to-their-hometowns-in-bangladesh/articleshow/91269859.cms

No comments